అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న పుట్టా

60చూసినవారు
మైదుకూరు పట్టణంలో ఆదివారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో మైదుకూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శనీయుడని కొనియాడారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్