బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

54చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజుపాళెం ఎస్ఐ తులసీనాగప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఆదేశాల మేరకు గురువారం టంగుటూరు గ్రామంలోని పాత సచివాలయం వద్ద మద్యం సీసాలు, అపరిశుభ్రంగా ఉన్న చెత్తా చెదారాన్ని గ్రీన్ అంబాసిడర్లతో కలసి ఆయన తొలగించారు. పోలీసులు సుధాకర్, నరేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాబు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్