దువ్వూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

53చూసినవారు
కడప జిల్లా దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామం దగ్గర ఆదివారం ఇన్నోవా కార్ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం. ఆదివారం మధ్యాహ్నం కర్నూలు నుంచి కడపకు వెళ్తున్న కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైందన్నారు. కారులో ఆరుగురు ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా. వారిని వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్