పులివెందుల: కూరగాయలు ధరలపై వైసీపీ నాయకులు నిరసన

60చూసినవారు
పెరిగిన కూరగాయల ధరలను నిరసిస్తూ వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో గురువారం పులివెందుల రంగనాద్ కూరగాయల మార్కెట్లో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్