వేంపల్లి: రెండో దశ పనులను ప్రారంభించాలి

73చూసినవారు
వేంపల్లి: రెండో దశ పనులను ప్రారంభించాలి
కడప - బెంగళూర్ రైలు మార్గం రెండో దశ పనులను ప్రారంభించాలని ఏపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. బుధవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2008-09లో కడప-రాయచోటి-మదనపల్లి-బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలుమార్గం మంజూరైందన్నారు. మొదటి దశ కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21. 80 కిలోమీటర్ల పని పూర్తయిందన్నారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా నిలిచిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలన్నారు.

సంబంధిత పోస్ట్