వేంపల్లి: ఇండియా కూటమి విజయం హర్షణీయం

65చూసినవారు
వేంపల్లి: ఇండియా కూటమి విజయం హర్షణీయం
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి విజయం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాల్లో గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగినప్పటికీ అధికారంలోకి రాలేకపోవడం విచారకరమన్నారు.

సంబంధిత పోస్ట్