వేంపల్లి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలు సీజ్

74చూసినవారు
వేంపల్లి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలు సీజ్
వేంపల్లి పట్టణంలోని పాపాగ్ని నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం అక్రమ ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. అనంతరం 2 ట్రాక్టర్లు, ఒక లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు వేంపల్లి సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్