ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలు పొందిన వారే

591చూసినవారు
రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలు పొందిన వారేనని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం రైల్వే కోడూరులో వైసిపి నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలను అభివృద్ధి చేసి తెలుగుతోపాటు ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబంలోని పిల్లలను విద్యావంతులను చేయడమే లక్ష్యంగా వైసిపి పార్టీ పనిచేస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్