రైల్వే కోడూరులో పట్టపగలే భారీగా చోరీ

77చూసినవారు
రైల్వే కోడూరులో పట్టపగలే భారీగా చోరీ
రైల్వే కోడూరులోని కొత్త కోడూరుకి వెళ్లే రహదారిలో ఉన్న మాచిరాజు కృష్ణంరాజు అనే వ్యాపారి ఇంట్లో సోమవారం పట్టపగలు దొంగలు చొరబడి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 50 తులాల బంగారు, 50 వేలు నగదు దొంగలు దోచుకు వెళ్లారు. తిరుపతికి ఆసుపత్రికి వెళ్లిన గంటల వ్యవధిలోనే పట్టణంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. 50 తులాల నగలు చోరీ కావడంతో యజమానురాలు లక్ష్మీదేవి ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్