ఒంటిమిట్ట మండలం పరిధిలో మార్చి 18వ తేదీ నుండి ప్రభుత్వం నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒంటిమిట్ట ఎంఈఓ జి వెంకటసుబ్బయ్య శనివారం తెలిపారు. ఒంటిమిట్ట మండల పరిధిలో 504 మంది విద్యార్థులు మూడు సెంటర్లలో పరీక్ష రాస్తున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాలలో బల్లలు, విద్యుత్ దీపాలు, ఫ్యానులు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.