ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా టిటిడి పరిరక్షణలో ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు, మనోజ్ కుమార్ లు సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలతో, అరటి పీలకలతో, వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ వేదికను టీటీడీ నిర్వహకులు అద్భుతంగా అలంకరించారు. వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.