గాలివీడులో పిడుగు పడి 18 గొర్రెలు మృతి

77చూసినవారు
గాలివీడులో పిడుగు పడి 18 గొర్రెలు మృతి
గాలివీడు మండలం తూముకుంట గ్రామంలో ఆదివారం పిడుగు పడి 18 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు రామప్ప నాయుడు తెలిపారు. నాయనవారి పల్లి కి చెందిన రామప్ప నాయుడు పలు జీవాలతో జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో పిడుగు పడి 18 గొర్రెలు మృతి చెందినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు గమనించి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్