నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సిపిఎం

51చూసినవారు
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సిపిఎం
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం సంబేపల్లి మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముద్దినేనివాండ్ల పల్లి, రెడ్డివారిపల్లి మోటకట్ల, శెట్టిపల్లి దేవపట్ల గ్రామాలలో పర్యటించి ఎండిపోయిన వేరుశెనగ పంటలను వారు పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్