ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి

83చూసినవారు
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
చిన్న మండెం మండలం బోరెడ్డిగారి పల్లెలోని తమ నివాసం నందు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు వందల సంఖ్యలో ప్రజాదర్బార్ కు తరలివచ్చారు. రాబోయే ఐదు సంవత్సరాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించి అన్నమయ్య జిల్లాను సమస్యల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్