ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి మండిపల్లి

73చూసినవారు
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి మండిపల్లి
ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం చిన్నమండెం మండలం, బోరెడ్డిగారి పల్లెలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6: 00 గంటలకే మంత్రి ఇంటి దగ్గరికి చేరుకొని వినతి పత్రాలతో బారులు తీరారు. మంత్రి సమస్యలను విని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్