సాధారణ ఎన్నికలు 2024 కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ లో శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, మున్సిపాలిటీ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.