కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గొల్లపల్లి సుబ్రమణ్యం తన అనుచరులతో కలిసి రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో శుక్రవారం జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి నానాజీ పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు.