యాంకరేజ్ పోర్టును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

63చూసినవారు
యాంకరేజ్ పోర్టును పరిశీలించిన జాయింట్ కలెక్టర్
కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ను సోమవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ పోర్ట్ లో అక్రమ బియ్యం ఎగుమతులను అరికట్టే చర్యల్లో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన బొంబాయి కాట, శక్తి గేట్ వద్ద ఉన్న రెండు చెక్ పోస్ట్ లను జేసీ రాహుల్ మీనా ఈ సందర్భంగా తనిఖీ చేశారు. పోర్టులోకి నిత్యం వస్తున్న బియ్యం లారిల సంఖ్య, వాహనాలను తనిఖీ చేస్తున్న తీరు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్