ఎన్డీయే సారథ్యంలో సుపరిపాలన

71చూసినవారు
ప్రజాధరణతో అధికారం లోకి వచ్చి నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మంచి సుపరిపాలన లభిస్తుందని జనసేనపార్టీజిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) తెలిపారు. ఎన్డీయేకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సామర్లకోట పట్టణ పరిధి గణపతినగరం షిర్డీ సాయిబాబా ఆలయంలో తుమ్మలరామస్వామి తదితర నాయకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంవద్ద 108 కొబ్బరికాయలతో జనసైనికులు మొక్కు చెల్లించారు.

సంబంధిత పోస్ట్