78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ

55చూసినవారు
పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు పట్టణ, మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా విద్యార్థులను భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరువలేనిదని, దేశం కోసం పాటుపడిన ప్రతి మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సత్యనారాయణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ, నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ గ్రండేటి మంగతాయారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్