కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సందడి

83చూసినవారు
కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ శనివారం పిఠాపురంలో సందడి చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక ప్రొడక్షన్లో నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో స్థానిక శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి పాదగయ, రాజరాజేశ్వరి శక్తి పీఠంలో అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, పట్టు చీర, అమ్మవారి చిత్రపటం అందజేశారు.

సంబంధిత పోస్ట్