ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను (పేస్ట్, బ్రష్, షాంంపూ) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానం తెచ్చినా రెగ్యులర్గా చేయలేదట. దాదాపు రూ.10 కోట్ల బకాయిలున్నట్లు తేల్చింది. దాంతో ఇకపై వస్తువుల్ని నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. 548 పాఠశాలల్లో 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.