టీడీపీ అధిష్టానం మూడో జాబితాను ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావులకు చోటు దక్కలేదు. ఇంకా ఉత్తరాంధ్రలో నాలుగు కీలక స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. చీపురుపల్లి, భీమిలి, ఎచ్చెర్ల, పాడేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను టీడీపీ ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.