ఐపీఎల్లో అత్యధిక (229) పరుగుల భాగస్వామ్యం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ద్వయం పేరిట ఉంది. 2016లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఆర్సీబీ జంట చెలరేగింది. కోహ్లీ (109), ఏబీ డివిలియర్స్ (129) శతకాలతో కదం తొక్కారు. దీంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ 104పరుగులకే ఆలౌటైంది.