ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జ్యూట్ బ్యాగులు ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అమలాపురం ఎస్సై శేఖర్ బాబు గురువారం పిలుపునిచ్చారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ మండలం కామనగరువులో ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ రాజులపూడి భీముడు పాల్గొన్నారు.