గోపాలపురం: మంత్రి నాదెండ్లను కలిసిన సువర్ణరాజు

54చూసినవారు
గోపాలపురం: మంత్రి నాదెండ్లను కలిసిన సువర్ణరాజు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, పులమాలతో సత్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు విషయాలను నాదెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. పలు పార్టీ అంశాలపై ఇరువురు చర్చించారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారని సువర్ణరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్