జగ్గంపేట: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం

85చూసినవారు
జగ్గంపేట: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం
జగ్గంపేట మండలం మల్లిసాలలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాతా సత్తిబాబు అనే వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం, సత్తిబాబు మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆటో బలంగా ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకు తరలించగా వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని ఎస్ఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్