ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సృష్టం చేశారు. వివిధ అధికారులతో మంగళవారం ఉదయం ఆయన కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా కాకినాడ జిల్లాలో తొలిసారిగా వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష చేయడం జరిగిందన్నారు.