దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం కాకినాడలో వేంచేసున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు కాళికాదేవి దేవిగా భక్తులకు దర్శించారు. ఆలయ ఈవో రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి తెల్లవారుజాము నుంచి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.