వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ ఉదయ శ్రీనివాస్ పర్యటన

84చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ ఉదయ శ్రీనివాస్ పర్యటన
గొల్లప్రోలులోని ఏలేరు వరద ముంపు ప్రాంతాలలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. ఆయా ప్రాంతాలలో వరదల వలన ముంపునకు గురైన పంటలను ఆయన పరిశీలించి రైతులకు కలిగిన నష్టంపై వారిని వివరాల అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వరదల కారణంగా నష్టపోయిన బాధితుల వివరాలను వెంటనే నమోదు చేసి వారికి ప్రభుత్వ తరపున సహకారం అందించాలని ఎంపీ అధికారులకు సూచించారు. నిత్యావసరాలకు లోటు లేకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్