వాడపల్లిలో వైభవంగా వెంకన్న సుప్రభాత సేవ

53చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తుల దైవ దర్శనానికిఅనుమతించారు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామివారిని కనులారా వీక్షించి పునీతులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్