పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

57చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
కాట్రేనికోన విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కాట్రేనికోన జడ్పిటిసి సభ్యులు నేల కిషోర్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబడిన ఈ స్టడీమెటీరియల్ ను ఉపయోగించుకుని విద్యార్థులు జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవాలని మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్