ముమ్మిడివరం: లంక భూములు నది పాతకం

54చూసినవారు
ముమ్మిడివరం మండలంలో లంక భూములు నదీ పాతకంగా మారుతున్నాయి. ఇటీవల వచ్చిన వరదలు, భారీ వర్షాల కారణంగా లంక భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. మండలంలో ఏటి గట్టును అనుకుని ఉన్న లంక భూములు, కొబ్బరి చెట్లు వరదల సమయంలో నది కోతకు గురవుతూ గోదావరిలో కలిశాయి. రైతులు ఇప్పటికే కొబ్బరి చెట్లను కోల్పోయామని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు స్పందించి నదీ కోత నివారణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్