పల్లంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

62చూసినవారు
పల్లంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను కాట్రేనికోన మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు బుధవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ కె ఆర్ ఎం కుమార్ సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పరిశీలన, పరిశోధన, తార్కిక ఆలోచన ద్వారా ప్రతి విద్యార్థి ఒక సైంటిస్ట్ గా రాణించవచ్చన్నారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఏ ఎస్ ఎస్ ఆర్ శర్మ, కే దుర్గాభవాని లు నిత్యజీవితంలో సైన్స్ ఉపయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్