వర్షపు నీటిలోనే విధులు నిర్వహణ

66చూసినవారు
ముమ్మిడివరం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ముంపు బారిన పడడంతో సిబ్బంది వర్షపు నీటిలోనే విధులు నిర్వర్తించారు. మండలంలో బుధవారం ఎడతెరిపిలేని భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం, సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయం, పోలీస్ స్టేషన్ తో పాటు పలు కార్యాలయాల్లో నీరు చేరండంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వర్షపు నీటిలోనే విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్