ఎస్.టి.యు. ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

59చూసినవారు
ఎస్.టి.యు. ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
రాష్ట్రోపాధ్యాయసంఘం (ఎస్. టి. యు) వజ్రోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దొంతుకుర్రు నందు కాట్రేనికోన
జెడ్పిటిసి సభ్యులు నేలకిషోర్ కుమార్ చేతులు మీదుగా మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు సామాజిక బాధ్యతతో మొక్కలను నాటడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణమూర్తి,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్