ఉండ్రాజవరం: మధ్యాహ్న భోజన పథకంపై చర్యలు తీసుకోవాలి

80చూసినవారు
ఉండ్రాజవరం: మధ్యాహ్న భోజన పథకంపై చర్యలు తీసుకోవాలి
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఉండ్రాజవరం మండలంలోని పలు పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం నాణ్యంగా లేవని తాడిపర్రు సర్పంచ్ కె. నరేంద్ర ఆరోపించారు. శనివారం తాడిపర్రులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు సరిగా భోజనాలు తినలేక పోతున్నారన్నారు. అధికారులు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్