టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

54చూసినవారు
రాజమండ్రి నగరంలోని 2వ డివిజన్‌కు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి మంగళవారం టీడీపీలో చేరారు. నగరంలోని ఆనంద్ ఏజెన్సీ వద్ద నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 100కు పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్