వర్గీకరణను నిరసిస్తూ ఆందోళన

75చూసినవారు
రాజ్యాంగాన్ని విస్మరించి ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదంటూ మలికిపురంలో శుక్రవారం మాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ రాజేష్ ఆధ్వర్యంలో పూలే, అంబేడ్కర్ భవనం వద్ద నిరసన తెలియజేశారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి మండల రెవెన్యూ కార్యాలయంకు చేరుకొని వినతిపత్రం ఇచ్చారు. వర్గీకరణను అడ్డుకుంటామంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్