మలికిపురం ఎంవీఎన్ కాలేజీ ఆవరణంలో గురువారం జరిగిన నిరసన దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సందర్శించి ఆయన మద్దతు తెలిపారు. జీతాల మీదే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న అధ్యాపకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కళాశాల యాజమాన్యం వారి జీతాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలన్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న వారికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.