లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కోనసీమ జేసీ

50చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని కోనసీమ జాయింట్ కలెక్టర్ టీ. నిశాంతి ఆదివారం దర్శించుకున్నారు. అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జేసీ పేరిట శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ పి. విజయసారథి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్