వైభవంగా లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం

58చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శాంతి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. బహుళ ద్వాదశి సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు సేకరించారు. ఈవో సత్య నారాయణ పర్య వేక్షణలో కార్యక్రమాలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్