సఖినేటిపల్లి: లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

69చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ మేరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా నిత్య అన్నదాన పథకం ద్వారా భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. సుమారు 4000 మంది భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్