వేతనాలు చెల్లించాలని అధ్యాపకుల నిరసన

67చూసినవారు
మలికిపురంలోని ఎంవీఎన్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంపై బుధవారం ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. వెతనాలు చెల్లించని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్