పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

68చూసినవారు
మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు మెంతిదిబ్బలో పంట పొలాలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఇటీవల వచ్చిన వరదలకు మంగలివానిసింకు డ్రైనేజీ ఎగదట్టి పొలాల్లోని వర్షపు నీరు ప్రవహించకపోవటంతో పాటు, ముంపు నీరు పొలాల్లో చేరడంతో దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. మోపిదేవి వైస్ ఎంపీపీ కడవకొల్లు సీతా రామాంజనేయులు, జనసేన సీనియర్ నాయకులు బాదర్ల లోలాక్షు నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్