అవనిగడ్డ గ్రామ సచివాలయం -1లో బుధవారం తలుపు సగం తీసి వృద్ధులను ఇలా ఇబ్బంది పెట్టడంపై మండిపడుతున్నారు. అన్ని సచివాలయాల్లో టెంట్ వేసి ఇస్తుంటే, ఇక్కడ ఇలా ఇవ్వడంపై వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. లోపల నుండి పేరు పిలిస్తే గోలలోవినపడక, కొత్తగా వచ్చిన వారి పేర్లు నమోదు చేయక తికమక గందరగోళం ఏర్పడింది. మండల స్థాయి అధికారులు ఒకసారి పరిశీలించాలని పింఛను దారులు కోరుతున్నారు.