కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుధవారం శాసనసభ్యులు పేర్ని నాని పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన అనుయాయిల ద్వారా హైకోర్టులో తప్పుడు పిటిషన్లు వేశారని తెలిపారు. ప్రజలకు మంచి చేసే వాలంటీర్లను తప్పుగా చూపిస్తూ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. రానున్న కాలంలో ప్రజలు చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెబుతారని ప్రసంగించారు.