మోపిదేవి: కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలి

66చూసినవారు
మోపిదేవి: కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలని టిడిపి నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మోపిదేవిలో ఆయన టిడిపి నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక్కని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగిన నాయకులు ముందుండి సహాయం అందించాలని తెలిపారు. ఇటీవల మోపిదేవి మండలంలో పలువురు కార్యకర్తలపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్