మైలవరం: పుల్లూరులో పల్లెపండుగ వారోత్సవాలు

81చూసినవారు
మైలవరం: పుల్లూరులో పల్లెపండుగ వారోత్సవాలు
మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో మంగళవారం 'పల్లెపండుగ' వారోత్సవాల్లో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్లూరు గ్రామంలో 1050 మీటర్ల పొడవునా 6 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పల్లెలకు పూర్వ వైభవం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్