వరద నీటిలో పెడన వాసి గల్లంతు

70చూసినవారు
వరద నీటిలో పెడన వాసి గల్లంతు
కృష్ణాజిల్లా పెడనకు చెందిన వ్యక్తి బుడమేరు వరద నీటిలో గల్లంతయ్యాడు. గన్నవరం నుండి మచిలీపట్నం వెళ్తుండగా శనివారం రాత్రి బుడమేరు వరద నీటిలో స్కార్పియో వాహనం కొట్టుకుపోయింది. స్కార్పియోలో ఉన్న వ్యక్తి భారీ నీటికి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి పెడనకు చెందిన కలిదిండి ఫణిగా గుర్తించారు. అతని కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్